మిర్యాలగూడ మహా
స్థానిక ఎస్వీ గార్డెన్స్ లో శాసనసభ నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు, సంఘాలకు సుమారు 58,64,30,239 రూపాయలు వివిధ రకాల రుణాల చెక్కును 4,197 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన నాడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలోని 6 మండలాల 568 సంఘాలకు సుమారు 54,83,96,009రూపాయలు, వడ్డీ రాయితీ కింద 3629 సంఘాలకు 3,14,79,144 రూపాయల చెక్కులను అందేసినట్టు నల్లగొండ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఎడవెల్లి శేఖర్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3911 సంఘాలకు 181 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. స్త్రీ నిధీ ఋణాలు ఈ సంవత్సరం 160 సంఘాలకు రూ.2.31కొట్లు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. 2410 మంది కొత్త సభ్యులతో 241 సంఘాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, మాడ్ గులపల్లి, వేములపల్లి ఎంపీడీఓలు ఎం.శేషగిరిశర్మ, మాతంగి రమేష్, సరిత, జితేందర్ రెడ్డి, డిపిఎం సోమయ్య, ఎపిడి శ్రావణ్ కుమార్, ఎస్.రామలింగయ్య, డిపిఏం రామలింగం, మిర్యాలగూడ మహిళా సమాఖ్య- 1, 2 అధ్యక్షులు నవ్య జ్యోతి, అడవిదేవులపల్లి, వేములపల్లి, దామరచర్ల అపర్ణ, నాగమ్మ, నాగమణి, సావిత్రమ్మ, డిఎంజి రవి, స్త్రీ నిధీ మేనేజర్ సుధాకర్,ఎపిఓలు జి. కృష్ణమూర్తి, డి.ఝాన్సీ, దిలీప్ కుమార్, శేషయ్య, నిజాముద్దీన్, చంద్రశేఖర్, సీసీలు, వీధుల, హైమావతి, నాగేంద్రమ్మ, రాజేష్, అన్నపూర్ణ, పిచ్చమ్మ, అకౌంటెంట్ రాణి,శైలజ, సయిదమ్మ, సురేందర్ రెడ్డి, గోపి, రమణ, నాగయ్య, వీఓఏలు పాల్గొన్నారు.








