Mahaa Daily Exclusive

  వెంటనే రూ.10 వేల కోట్లు విడుదల చేయాలి: మాజీ మంత్రి సబిత

Share

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితారెడ్డి విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ చెలగాటం ఆడుతున్నారని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. ఇప్పటివరకు బకాయి పడ్డ రూ.10వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము కరోనా సమయంలో ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా నిధులు ఆపలేదన్నారు.