2026 జూలై నెల లో భారత ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పటిష్టమైన విధానాల మద్దతుతో భారతదేశ వ్యవసాయ ఎగుమతుల రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. పచ్చని అస్సాం కొండల నుండి కాశ్మీర్ తోటల వరకు, మన స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించి, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల రంగంలో మన దేశ సత్తాను చాటాయి. మోదీ ప్రభుత్వ ‘వోకల్ ఫర్ లోకల్’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పం క్షేత్రస్థాయిలో ఎలా సాకారం అవుతోందో ఈ విజయాలు స్పష్టం చేస్తున్నాయి. “అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా)” సహకారంతో సాధించిన ఈ ఘనతలు కేవలం వ్యాపార విజయాలు మాత్రమే కాదు; ఇవి మన రైతుల ఆదాయాన్ని పెంచే ఒక అద్భుతమైన అడుగు మరియు మన దేశ ప్రగతికి గర్వకారణం. ఈ జూలైలో నమోదైన కొన్ని అద్భుతమైన ఎక్స్పోర్ట్ స్టోరీస్ ఇక్కడ చూద్దాం:
అస్సాం పూరబీ ఐస్క్రీమ్ పేరుతో ఈశాన్య భారతదేశ డైరీ సెక్టార్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, అస్సాంకి చెందిన పూరబీ ఐస్క్రీమ్ భూటాన్కు ఎగుమతి అయ్యింది. ఈ అంతర్జాతీయ షిప్మెంట్లోని 5,627 లీటర్ల ఐస్క్రీమ్, మన స్థానిక బ్రాండ్స్కి ప్రపంచస్థాయిలో ఉన్న డిమాండ్ను స్పష్టంగా చూపిస్తోంది.
ఇంకొక ఉత్పత్తి బీహార్ ఫ్లేవర్డ్ మఖానా. మొదటిసారిగా మఖానా ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బీహార్, వాల్యూ-యాడెడ్ ఫ్లేవర్డ్ మఖానాను కెనడాకు సముద్ర మార్గం ద్వారా పంపి ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఈ 7-మెట్రిక్-టన్నుల ఎగుమతి “లోకల్ టు గ్లోబల్” అనే లక్ష్యానికి ఒక చక్కటి ఉదాహరణ.
కర్ణాటక నీలం మరియు తోతాపురి మామిడి పండ్లు కూడా…కర్ణాటకకు చెందిన ఈ ప్రత్యేకమైన మామిడి పండ్లను మొదటిసారిగా మాల్దీవులకు ఎయిర్ షిప్ మెంట్ ద్వారా పంపించారు. ఈ అద్భుతమైన చొరవ వల్ల మన రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
కాశ్మీర్ ప్రీమియం చెర్రీస్ మరియు ప్లమ్స్.. జమ్మూ, కాశ్మీర్ లోని షోపియాన్ మరియు పుల్వామా నుండి అత్యుత్తమ నాణ్యత గల అరెకో చెర్రీస్ మరియు సెంట్రోజ్ ప్లమ్స్ మొదటిసారిగా సింగపూర్కు చేరుకున్నాయి. మన దేశపు ప్రీమియం పండ్లకు ఇది ఒక గొప్ప అంతర్జాతీయ ప్రవేశం.
ఉత్తరాఖండ్ ఫ్రోజెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ పేరుతో ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్లోకి ఘనంగా ప్రవేశిస్తూ, ఉత్తరాఖండ్ 24 మెట్రిక్ టన్నుల ఫ్రోజెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ను ఇరాక్కు ఎగుమతి చేసింది. ఇది మన ఫుడ్ ఇండస్ట్రీకి కొత్త అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను సృష్టిస్తుంది.
లడఖ్ ఆర్గానిక్ ఆప్రికాట్స్ పేరుతో లడఖ్ తన మొట్టమొదటి 5-మెట్రిక్-టన్నుల ఆర్గానిక్ ఆప్రికాట్స్ షిప్మెంట్ను యూఏఈ కి విజయవంతంగా పంపింది. మన ప్రీమియం సేంద్రీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడం ఒక గొప్ప విషయం.
జార్ఖండ్ ఆమ్రపాలి మామిడి పండ్లు.. మన గిరిజన మహిళా రైతులు పండించిన 2 మెట్రిక్ టన్నుల ప్రీమియం ఆమ్రపాలి మామిడి పండ్లు దుబాయ్కు కమర్షియల్ ఎగుమతి అయ్యాయి. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ వల్ల మహిళా రైతులకు స్థానిక మార్కెట్ కంటే 180% ఎక్కువ లాభం రావడం నిజంగా స్ఫూర్తిదాయకం.
పంజాబ్ ఫ్రెష్ లిచీ… పేరుతో పంజాబ్ మొదటిసారిగా తాజా లిచీ పండ్లను ఒమన్కు ఎగుమతి చేసి వ్యవసాయ ఎగుమతులలో తనదైన ముద్ర వేసింది. ఇది మన ప్రీమియం పండ్ల శ్రేణిని అంతర్జాతీయ మార్కెట్లో మరింత బలోపేతం చేస్తుంది.
ఈ విభిన్నమైన ఎగుమతుల మైలురాళ్ళు భారతదేశపు ప్రగతి దేశంలోని నలుమూలలకూ చేరుకుంటోందని నిరూపిస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వ నిరంతర మద్దతు, సరైన ఎగుమతి విధానాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్లే ఇదంతా సాధ్యమైంది.
మన రైతులను ఎంపవర్ చేస్తూ, మన దేశ వ్యవసాయ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్న ఈ విజయాలు నిజంగా ఒక సానుకూల మరియు శక్తివంతమైన పరిణామం!
(శివ కుమార్ గనివాడ, సీనియర్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ ఎక్స్పర్ట్)







