Mahaa Daily Exclusive

  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు..!

Share

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఛార్జ్‌షీట్‌లో పేరున్న వ్యక్తి.. చట్టప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది. దర్యాప్తు వివరాల ఆధారంగా నిందితుడు కొన్ని నెలలు పరారీలో ఉన్నందున ముందస్తు బెయిల్‌కు అర్హత లేదని పేర్కొంది. పోలీసుల విచారణకు హాజరుకానందున శ్రవణ్‌కుమార్‌కు బెయిల్‌ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.