Mahaa Daily Exclusive

  శ్రీవారి ఆలయాలకు ఉచితంగా స్థలం కేటాయించండి: టీటీడీ ఛైర్మన్

Share

దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా భూమి కేటాయించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన పలు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, సమాజాభివృద్ధికి కూడా దోహదపడతాయని ఆయన అన్నారు. దేశాభివృద్ధిలో ఆలయ పర్యాటకం ముఖ్యమని ఆయన అన్నారు. మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవడంలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.