Mahaa Daily Exclusive

  కార్యకర్తల శరీరంలోని ప్రతి రక్తపు బొట్టూ పసుపు రంగే: సీఎం చంద్రబాబు

Share

భవిష్యత్తులో గెలుపే ధ్వేయంగా పార్టీ కోసం పనిచేస్తామని.. ప్రతి ఎన్నికల్లో గెలిచే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం మార్కాపురంలో చంద్రబాబు మాట్లాడుతూ..”అన్ని ఎన్నికల్లో మనం గెలిస్తే కార్యకర్తలకు గౌరవం పెరుగుతుంది. కార్యకర్తల శరీరంలోని ప్రతి రక్తపు బొట్టూ పసుపు రంగే. నాయకులు పార్టీని వీడి వెళ్తారు. కానీ, కార్యకర్తలు మాత్రం ఒక్క అడుగు కూడా అటూ ఇటూ వేయరు.” అని అన్నారు.