ఎస్సీ వర్గీకరణ అమలు చేయడమే అంబేద్కర్ కు ఘన నివాళి అని సీఎం రేవంత్ అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుని విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మోత్కుపల్లి నర్సింహులు, పలువురు నేతలు పాల్గొని బాబాసాహెబ్ సామాజిక సమానత్వ సందేశాన్ని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
Post Views: 43








