AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించనున్నారు. రైతులతో సమావేశమై, వారి కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న జగన్ హెలికాఫ్టర్లో ఉ.11 గం.కు కొత్తపల్లికి రానున్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డులో జగన్తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించారు.
Post Views: 20








