వరంగల్ మహా ;
ప్లాస్టిక్ రహిత మహా నగరంగా గ్రేటర్ వరంగల్ ను తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు.
శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజారోగ్య విభాగం, ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అంశాల పై (డీ స్లడ్జింగ్ ఆపరేటర్ లతో) నిర్వహించిన సమావేశంలో మేయర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి పాల్గొని వర్తక వాణిజ్య వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా అంకితభావంతో కృషి చేయాలని, 120 మైక్రాన్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడితే పర్యావరణం తో పాటు మానవ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని, ప్లాస్టిక్ ప్రత్యామ్నంగా వినియోగం తర్వాత కంపోస్ట్ గా మారే పర్యావరణానికి విఘాతం కలిగించని బయో డిగ్రేడబుల్ సంచులు ,వస్త్ర, జ్యూట్ సంచులు నిత్యజీవితం లో వాడేలా అవగాహన కల్పించాలన్నారు. మహా నగరం లో ప్లాస్టిక్ సంబంధ ఉత్పత్తులు విక్రయించే దుకాణదారులు ఎలాంటి ప్లాస్టిక్ క్రయ విక్రయాలు జరుపకూడదని, స్టోర్ లో నిలువ ఉండకూడదని, ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే సమాచారం అందించాలని, నిబంధనలు ఉల్లంఘించి ఎవరైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మితే లక్ష రూపాయల జరిమాన తో పాటు దుకాణాన్ని మూసి వేసి, నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు రవాణా చేసిన వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుందని, ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయ హోల్ సేల్, రిటైల్ వ్యాపారాలు కార్పొరేషన్ కు సహకరిస్తూ పర్యావరణ హితం కోసం పాటు పడుతూ ప్లాస్టిక్ రహిత నగరం గా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు.
బల్దియా పరిధి 44 వ డివిజన్ లోని అమ్మవారి పేట లో నగర అవసరాలకు అనుగుణంగా 150 కే ఎల్ డి సామర్ధ్యం తో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం సిద్ధం కావడం జరిగిందని, నగర వ్యాప్తంగా 2.50 లక్షల గృహాలు ఉన్నాయని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం – ప్రకారం ప్రతి 3 సం.లకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అధికారికంగా బల్దియా అనుమతులు పొందిన సెప్టిక్ ట్యాంకర్ ల ద్వారా మాత్రమే శుభ్రం చేయించుకోవాలని సూచించారు. ట్యాంకర్ లు వ్యర్థాలను విధిగా ఎఫ్ ఎస్ టి పి కి అందజేయాలని, అనధికారిక సెప్టిక్ ట్యాంక్ లు నగరం లో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు డంప్ చేస్తే జరిమాన తో పాటు వాహనం సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీ స్లడ్జింగ్ ఆపరేటర్ లు, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు అందరూ సహకరించాలని ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్ ఆపరేటర్ లు కార్పొరేషన్ ద్వారా ఎంప్యానల్ చేసుకొని అధికారికం గా సెప్టిక్ ట్యాంక్ లు నిర్వహించుకోవచ్చునని మేయర్ తెలిపారు.
బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి మాట్లాడుతూ వరంగల్ మహానగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల వారు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ తరపున 14420 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశామని, ఈ నెంబర్ పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
అనంతరం డి స్లడ్జింగ్ ఆపరేటర్లకు మేయర్, కమిషనర్ లు రక్షక కవచాలు అందజేశారు.
ఈ సమావేశంలో ఆదనవు కమిషనర్ జోనా, సీఎం హెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, ఆస్కి కోఆర్డినేటర్ రాజమోహన్ రెడ్డి, శ్వేతా, స్లడ్జింగ్ ఆపరేటర్లు, నగరంలోని వర్తక వాణిజ్య వ్యాపారస్తులు, తదితరులు, పాల్గొన్నారు.








