TG: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తమ పార్టీనే కైవసం చేసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేని కారణంగానే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు.
Post Views: 73








