Mahaa Daily Exclusive

  ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు..!

Share

ఖమ్మం, మహా.
కల్లూరు మున్సిపాలిటీ, ఖాన్ ఖాన్ పేట, ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా, ద్విచక్ర వాహనం ఒక వృద్ధుణ్ణి ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఖాన్ ఖాన్ పేట నుండి కల్లూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో మినీ స్టేడియం నుంచి అటుగా నడుచుకుంటూ వెళ్తున్న మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పిఏ నాగరాజు, సంఘటనను గమనించి 108 కి ఫోన్ చేసి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. వాహనం నడిపిన వ్యక్తికి, అలాగే వృద్ధునికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.