చంద్రగ్రహణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తిరుమల, శ్రీశైలం, సింహాచలం, బాసర, యాదగిరిగుట్ట, విజయవాడ ఇంద్రకీలాద్రి, భద్రాద్రి రామాలయం ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత వేకువజామున 2.40 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. సుప్రభాత సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 18 కంపార్టెమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
Post Views: 89






