AP: వైసీపీ తీరుపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. కోరలు పీకేసినా పాము కాటేస్తుందనే రీతిలో వైసీపీ ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, యూరియా పంపిణీ విషయంలో ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు మాటలను ఎడిట్ చేసి ముఖ్యమంత్రి రైతులను హెచ్చరించారనే విధంగా ఫేక్ వీడియోని క్రియేట్ చేశారని వివరించారు. ప్రజలంతా ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Post Views: 31






