అనంతపురంలో బుధవారం నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం కేవలం సూపర్ సిక్స్ మాత్రమే కాదు.. ఇప్పటి వరకు ఎన్నో సిక్సులు కొట్టింది. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. త్వరలోనే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కూడా పూర్తవుతుంది. డబుల్ ఇంజన్ సర్కారు హయాంలో ఏడాదిలో రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి’ అని ఆయన వివరించారు.
Post Views: 35






