AP: కూటమి ప్రభుత్వంపై జగన్, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కూటమి ప్రభుత్వం 90 శాతం హామీలు అమలు చేసిందన్నారు. అందుకే బుధవారం అనంతపురంలో నిర్వహిస్తున్న ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు సమర్థ నాయకుడని, రాష్ట్ర అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమం అందిస్తున్నారని మంత్రి నారాయణ వివరించారు.
Post Views: 28






