Mahaa Daily Exclusive

  కాలుజారి కింద పడిపోయిన మేయర్ విజయలక్ష్మి,..!

Share

హైదరాబాద్‌ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. నగరంలో సుందరీకరణ పనుల్లో భాగంగా పర్యటన చేస్తుండగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ వద్ద ఆమె కాలు జారీ కిందపడిపోయారు. ఆమెకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. ఆ తర్వాత ఆమె నడుచుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు ఈ అంశంపై భారీగా కామెంట్లు చేస్తున్నారు.