Mahaa Daily Exclusive

  14 వేల పెన్షన్లు తొలగించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Share

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 14 వేల పెన్షన్లు తొలగించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని వైసీపీ నేతలు దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని అన్నారు. తాము అనర్హుల పెన్షన్లను మాత్రమే తొలగించామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో పెన్షన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ పై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ విధంగా జవాబు ఇచ్చారు.