Mahaa Daily Exclusive

  గతంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అస్తవ్యస్తం: అనగాని సత్యప్రసాద్

Share

శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. దీనికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదన్నారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై కేబినెట్‌లోనూ చర్చించలేదన్నారు. జిల్లా పునర్‌వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా చేశారన్నారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నామన్నారు.