Mahaa Daily Exclusive

  తెలంగాణ శాసనమండలి నుంచి BRS వాకౌట్…!

Share

కులగణన సర్వే నివేదికపై BRS ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తూ శాసనమండలి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కులగణన పేరుతో బీసీల హక్కులు కాలరాస్తున్నారని BRS నేత శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలను కేబినెట్ ఆమోదించగా.. మంగళవారం అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి రికార్డు సృష్టించామని సీఎం రేవంత్ తెలిపారు.