Mahaa Daily Exclusive

  ఖమ్మంలో లలితా జువెల్లరీ 60వ బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్….!

Share

ఖమ్మం నగరంలో లలితా జువెల్లరీ 60వ బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ లలితా జువెల్లరీ నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తోందని ప్రశంసించారు. దక్షిణ భారతదేశంలో 41 ఏళ్లుగా విశ్వసనీయమైన సేవలు అందిస్తూ, వినియోగదారులకు అనుకూలమైన ధరలతో బంగారు, వజ్రాభరణాలను అందిస్తున్న లలితా జ్యూవెల్లరీ మరింత విస్తరించడం అభినందనీయమన్నారు.

తయారీధరకే నగలు – వినియోగదారులకు లాభం

వినియోగదారులకు అనుకూలమైన ధరలతో నగలను అందించడమే తమ లక్ష్యమని లలితా జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ తెలిపారు. తయారీధరకే బంగారు, వజ్రాభరణాలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని ఆదా చేసుకోవచ్చని అన్నారు. ప్రత్యేకంగా మార్కెట్లో లభించని ‘బంగారు నగల కొనుగోలు పథకం’ను ప్రారంభోత్సవ సందర్భంగా ప్రవేశపెట్టారు.

దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరణ లక్ష్యం

వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు, గూడూరు, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం, కడప, ఒంగోలు, కర్నూలు, నిజామాబాద్, వరంగల్, మిర్యాలగూడ, హైదరాబాద్‌ కూకట్పల్లి, సోమాజిగూడ, దిల్షుఖ్‌నగర్, చందానగర్, సుచిత్రా సర్కిల్‌ సహా పలు ప్రాంతాల్లో తమ షోరూమ్‌లు ప్రజల విశేష ఆదరణ పొందాయని, దక్షిణ భారతదేశం మొత్తం తమ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తున్నామని కిరణ్ కుమార్ వివరించారు.

వెల్లివిరిసిన ప్రారంభోత్సవ వేడుకలు

షోరూమ్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. షోరూమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జొహారా తదితరులు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఖమ్మం ప్రజలకు మరింత చేరువ

లలితా జువెల్లరీ ఖమ్మం నగరంలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించడంతో స్థానికులకు అధిక నాణ్యత కలిగిన నగలను తక్కువ ధరలో పొందే అవకాశం ఏర్పడిందని మంత్రులు తెలిపారు. వినియోగదారుల నమ్మకాన్ని మరింతగా నిలబెట్టుకుంటూ, లలితా జ్యూవెల్లరీ తన విశ్వసనీయతను కొనసాగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

Latest