Mahaa Daily Exclusive

  నేడు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్…!

Share

తెలంగాణలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ యువతకు ఈ పథకం ద్వారా రాయితీ రుణాలు అందజేసి స్వయం ఉపాధికి బాటలు వేయనున్నారు.
ఈ పథకం కింద దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6వేల కోట్ల రాయితీలు ఇవ్వనున్నారు.