పాకిస్తాన్ పౌరులు ఇకపై భారతదేశాన్ని సందర్శించడానికి అనుమతించబడరని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఉన్న పాక్ జాతీయులు ఎవరైనా 48 గంటల్లోపు దేశం విడిచి వెళ్లాలని కూడా ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. తమతమ రాష్టాలలో ఉన్న పాక్ పౌరులు దేశం విడిచి పోయేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Post Views: 88








