Mahaa Daily Exclusive

  వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి బయటకు రావొద్దు: పొన్నం

Share

TG: హైదరాబాద్‌లో ఆకస్మికంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు ప్రజారవాణాను ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిది.  వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్లమీదకు రాకండి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. కొంత సమయం తీసుకుని రోడ్ల మీదకు వస్తే మంచిది. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు.