Mahaa Daily Exclusive

  మహిళలను ఆరాధించే సంప్రదాయం మనది: కిషన్ రెడ్డి

Share

భారతీయుల జీవన విధానంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళలను ఆరాధించే సంప్రదాయం మనదని తెలిపారు. మహిళలే ఇంటిని సమర్థంగా నడుపుతారని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.