Mahaa Daily Exclusive

  నేడు అమిత్‌షా నివాసంలో సింధు జలాలపై కీలక సమావేశం..!

Share

కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసి, వాఘా-అట్టారీ సరిహద్దును మూసివేసింది. ఈ మేరకు సింధు జలాల వివాదాస్పద అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో నేడు కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి సహా పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. జలవనరుల పంపిణీ, దేశాల మధ్య ఒప్పందాల అమలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది.