నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi police station) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ జంటను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు(Woman murdered). వివరాల్లోకి వెళ్తే.. పుప్పాలగూడలోని అనంతపద్మనాభ స్వామి ఆలయ సమీపంలోని గుట్టపై కొంతమంది పతంగులు ఎగురవేయాడానికి వెళ్లారు. ఈ క్రమంలో మృతదేహాలను గుర్తించారు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 76








