సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవ ఏర్పాట్లను రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా జరుగుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాల ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడమని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
Post Views: 43








